Monday 24 October 2011

ఆయన దయవల్లే ప్రమాదం నుంచి..: రామ్‌చరణ్‌

'ఆ రోజు సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డానంటే కారణం అయ్యప్ప కరుణా కటాక్షాల వల్లే. ఇదనే కాదు, జీవితంలో ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశం అయ్యప్ప దీక్ష చేయటం ద్వారా నాకు లభించింది' అని హీరో రామ్‌చరణ్‌ అంటున్నారు. రామ్‌చరణ్‌ అయ్యప్ప మాల ధరించటం ఇది ఏడోసారి. ఈ సందర్భంగా శబరిమల వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. వీటి అనుభవాల్ని రామ్‌చరణ్‌ ఈ విధంగా చెబుతున్నారు... 'ఆస్తులు, అంతస్తులు, సౌకర్యాలు ఇవి కాదు ముఖ్యం. కాళ్లు ఎప్పుడూ నేలపైనే ఉండాలి...అనేది తెలుసుకున్నా. దీక్ష వల్ల ప్రశాంతంగా ఉండి పనులపై ఏకాగ్రత పెరిగింది. శబరిమల యాత్ర చాలా గొప్పగా జరిగింది. ఇద్దరు స్నేహితులు కూడా వెంట ఉన్నారు. యాత్రలో భాగంగా సాగిన నడక, అక్కడి వాతావరణం ఇప్పటికీ నా మనస్సులో ఉండిపోయింది. దీక్ష వల్ల మన మనస్సులో ప్రశాంతత, జీవితంలో బ్యాలెన్స్‌ తీసుకొస్తుందని యువతకు, బిజినెస్‌మెన్స్‌కు సలహా కూడా ఇస్తున్నా'నని ఆయన అన్నారు.

No comments:

Post a Comment